హైదరాబాదులో గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ సదస్సు.. ముఖ్య అతిథిగా ఇవాంకా

హైదరాబాదులో గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ సదస్సు.. ముఖ్య అతిథిగా ఇవాంకా

Friday August 11, 2017,

1 min Read

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాదుకు అతిథిగా రాబోతున్నారు. నవంబర్ లో మూడు రోజులపాటు జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఆమె పాల్గొంటారు. అమెరికా బృందాన్ని ఇవాంకా లీడ్ చేస్తారు. హైదరాబాదులో గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ సమ్మిట్ జరగబోతోందన్న విషయాన్ని ప్రధాని మోడీ ట్విటర్ ద్వారా వెల్లడించారు.

image


భారత, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోడితో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజరయ్యేందుకు అంగీకరించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడం ఔత్సాహికులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. చారిత్రక నగరమైన హైదరాబాద్ ఈ చారిత్రక సదస్సుకు వేదిక అవుతుండడం సంతోషంగా ఉందన్నారు.

image


ఈ సదస్సుకు వచ్చే అమెరికా బృందానికి ఇవాంకా నాయకత్వం వహిస్తుండగా, భారత దేశం తరుఫున ప్రధాని నరేంద్ర మోడీ అమితాసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నందకు సంతోషంగా ఉందని ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 

image